వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డిని ఆశీర్వదించాలని తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలకు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థిగా వీఆర్ రామిరెడ్డి ఎన్నికల బరిలో ఉంటారని.. ఆయన్ను గెలిపించి జగన్బాబు సీఎం కావడానికి సహకరించాలన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె పట్టణంలోని వైఎస్ విగ్రహం వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. అంతకు మించిన అభివృద్ధి జరగాలంటే వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం అన్ని వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే అంబిక (రమేష్ రెడ్డి భార్య)ను చైర్పర్సన్ చేస్తామని చెప్పారు. అలాగే అనంత వెంకట్రామిరెడ్డిని కూడా గెలిపించాలని కోరారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె పట్టణంలోని వైఎస్ విగ్రహం వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. అంతకు మించిన అభివృద్ధి జరగాలంటే వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం అన్ని వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే అంబిక (రమేష్ రెడ్డి భార్య)ను చైర్పర్సన్ చేస్తామని చెప్పారు. అలాగే అనంత వెంకట్రామిరెడ్డిని కూడా గెలిపించాలని కోరారు
0 comments:
Post a Comment