ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్(కాంగ్రెస్) శుక్రవారం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ ఆయన మెడలో కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనభేరి సభలో ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, గుదిబండి చిన వెంకటరెడ్డి, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘‘త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ అభ్యర్థి రామకృష్ణారెడ్డిని, పార్లమెంటు అభ్యర్థి అయోధ్యరామిరెడ్డిని ఆశీర్వదించండి. అంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చక్రం తిప్పాలని కోరుతున్నా’’ అని జగన్ సభలో పిలుపునిచ్చారు.
Home »
» పార్టీలో చేరిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేశ్
పార్టీలో చేరిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేశ్
Written By news on Saturday, March 8, 2014 | 3/08/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment