వైఎస్ఆర్ సీపీ సానుభూతి పరులపై టీడీపీ నేత దౌర్జన్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ సానుభూతి పరులపై టీడీపీ నేత దౌర్జన్యం

వైఎస్ఆర్ సీపీ సానుభూతి పరులపై టీడీపీ నేత దౌర్జన్యం

Written By news on Sunday, March 9, 2014 | 3/09/2014

గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన జనభేరీ సభలకు వెళ్లిన ఆ పార్టీ సానుభూతిపరులపై టీడీపీ నేతలు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. అందులోభాగంగా చిలకలూరిపేట సమీపంలోని కొండ్రుపాడు గ్రామవాసులు వైఎస్ జగన్ సభలకు తరలి వెళ్లడంపై స్థానిక టీడీపీ నేత అనంత నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఆయన వైఎస్ఆర్ పార్టీ సానుభూతిపరులపై దౌర్జన్యానికి దిగారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయకుంటే  ఇళ్లను ఖాళీ చేయిస్తామని బెదిరించారు. దాంతో వైఎస్ఆర్ సానుభూతిపరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
Share this article :

0 comments: