గన్నవరం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరంలో ఘన స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో జగన్కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో పెనుమలూరుకు చెందిన పలు పార్టీల కార్యకర్తలు వైఎస్ఆర్ సీపీలో చేరారు.
జగన్ నేటి నుంచి మూడు రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం నరసాపురంలో జనభేరి నిర్వహిస్తారు. ఈ సభలోనే నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్ఆర్ సిపిలో చేరనున్నారు. రేపు పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలో, ఆదివారం కొవ్వూరులో జగన్ ప్రచారం నిర్వహించనున్నారు.
జగన్ నేటి నుంచి మూడు రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం నరసాపురంలో జనభేరి నిర్వహిస్తారు. ఈ సభలోనే నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్ఆర్ సిపిలో చేరనున్నారు. రేపు పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలో, ఆదివారం కొవ్వూరులో జగన్ ప్రచారం నిర్వహించనున్నారు.
0 comments:
Post a Comment