యువ నాయకత్వాన్ని కోరుకుంటున్న ప్రజలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » యువ నాయకత్వాన్ని కోరుకుంటున్న ప్రజలు

యువ నాయకత్వాన్ని కోరుకుంటున్న ప్రజలు

Written By news on Saturday, March 22, 2014 | 3/22/2014

శ్రీకాకుళం అర్బన్:
 రాష్ట్ర ప్రజలంతా యువ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని 31వ వార్డు గుడివీధి, దమ్మలవీధి తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఇంటింటికీ పర్యటించి వైఎస్‌ఆర్ సీపీ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు వివరించారు.
 
 ఫ్యాన్ గుర్తుపైనే ఓటువేసి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ నాయకుడైన జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జగన్‌తోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా విశ్వసిస్తున్నారన్నారు.
 
 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులను ఎవరూ మరచిపోలేదన్నారు. ఇపుడు కూడా ఆ పార్టీకి ఓటువేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లేనన్నారు. పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెడతారన్నారు.
 
 తద్వారా ఇటు విద్యార్థుల చదువు, అటు ఆ తల్లికి కొంత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి, చల్లా అలివేలు మంగ, పైడి రాజారావు, జె.ఎం.శ్రీనివాస్, అబ్దుల్ రెహమాన్, టి.కామేశ్వరి, ఎన్ని ధనుంజయ్, మండవిల్లి రవి, కె.ఎల్.ప్రసాద్, శిమ్మ వెంకట్రావు, గుడ్ల మల్లేశ్వరరావు, కోరాడ రమేష్, రావాడ జోగినాయుడు, చల్లా మంజుల, గుంట జ్యోతి, డబ్బీరు విజయలక్ష్మి, శ్రీనివాస్ పట్నాయక్, కర్నేని హరి, కూన వాసుదేవరావు, పొన్నాడ రుషి, పిల్లల నీలాద్రి, గుమ్మా నగేష్‌పాల్గొన్నారు.
Share this article :

0 comments: