లండన్: బ్రిటన్ రాజధాని లండన్ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వైఎస్ ఆర్ సీపీ యూకే, యూరప్ విభాగం మార్చి 15న పార్టీ ఆఫీసును ఆరంభించింది. ఈ సందర్బంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే, యూరప్ విభాగం అధ్యక్షుడు వంగల సందీప్ రెడ్డి మాట్లాడుతూ "వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి మూడు సంవత్సరాలైంది. ఈ మూడేళ్లలో మనం తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్నాం. ఎన్నో ఆటుపొట్లను కూడా ఎదుర్కొన్నాం. జన నాయకుడయిన జగనన్నను ఎన్నికల ప్రచారం మధ్యలొ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా జైలుకు పంపించింది. తాము ఎన్నికలలో గెలవలేమని భయంతో కాంగ్రెస్ మన పార్టీని మొగ్గలోనే తుంచేయాలని కుట్రలు కుతంత్రాలు పన్నింది. ఈ అన్యాయనికి వ్యతిరేకంగా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఉప ఎన్నికలలొ తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వారి ఆత్మ గౌరవానికి ఢిల్లీ దొరల అహంకారానికి మధ్య పోరాటం జరగుతోంది'' అని అన్నారు.
Home »
» లండన్లో వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం
లండన్లో వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం
Written By news on Sunday, March 16, 2014 | 3/16/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment