సార్వత్రిక ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆపార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. 'ప్రజల్లో నిలిచేది మేమే...గెలిచేది మేమే' అని ఆమె బుధవారమిక్కడ అన్నారు. వాసిరెడ్డి పద్మ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అని అన్నారు. ఎన్నికల్లో జగన్ కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజన్న రాజ్యం స్థాపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. అన్ని సర్వేలు వైఎస్ఆర్ సీపీ ప్రభంజనమే అని చెబుతున్నాయని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Home »
» ప్రజల్లో నిలిచేది మేమే.. గెలిచేది మేమే
ప్రజల్లో నిలిచేది మేమే.. గెలిచేది మేమే
Written By news on Wednesday, March 5, 2014 | 3/05/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment