విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప మంగళవారం రాజమండ్రిలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. జగన్ను కలిసి వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్ తనను పిలిచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారన్నారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దయవల్లేనన్నారు. ఆయన రుణం తీర్చుకునేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు.
పార్టీలోకి చేరికలు
విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కందుల రఘుబాబు, డీసీసీబీ మాజీ డెరైక్టర్ బర్రి చిన్నప్పన్న రాజమండ్రిలో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. బేబీనాయన ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి జగన్ తన పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. జగన్ పర్యటనలో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, విజయనగరం, శ్రీకాకుళం పార్టీ జిల్లా అధ్యక్షులు పెన్మత్స సాంబశివరాజు, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, రౌతు సూర్యప్రకాశరావు, సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, విజయనగరం, రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ నాయకులు బేబి నాయన, బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, రాజమండ్రి నగర , రూరల్ కో ఆర్డినేటర్లు బొమ్మన రాజ్కుమార్, ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment