ఖమ్మం జిల్లాలో రాజన్న తనయుడికి ఘన స్వాగతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఖమ్మం జిల్లాలో రాజన్న తనయుడికి ఘన స్వాగతం

ఖమ్మం జిల్లాలో రాజన్న తనయుడికి ఘన స్వాగతం

Written By news on Wednesday, March 5, 2014 | 3/05/2014

ఖమ్మం జిల్లాలో రాజన్న తనయుడికి ఘన స్వాగతం
ఖమ్మం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఖమ్మంలో ఘన స్వాగతం లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని బుధవారం ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టిన రాజన్న తనయుడికి సత్తుపల్లి మండలం గంగారం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ఆర్ జనభేరిలో భాగంగా గంగారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు.

అక్కడ నుంచి  సత్తుపల్లి, వైరా మీదుగా జగన్ ఖమ్మం చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక  జనభేరి సభ జరగనున్న పెవిలియన్ గ్రౌండ్ వైఎస్సార్‌సీపీ తోరణాలు, జగన్ ఫ్లెక్సీలతో ముస్తాబైంది. జగన్ ప్రసంగించనున్న ప్రధాన వేదికను మహానేత వైఎస్‌ఆర్, జగన్ చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీలతో తీర్చిదిద్దారు. కాగా సభ ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఎస్పీ ఎ.వి.రంగనాథ్ నేతృత్వంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Share this article :

0 comments: