వారిద్దర్నీ గెలిపించుకుందాం : జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వారిద్దర్నీ గెలిపించుకుందాం : జగన్

వారిద్దర్నీ గెలిపించుకుందాం : జగన్

Written By news on Wednesday, March 5, 2014 | 3/05/2014

ఏలూరు : ఐఏఎస్ అధికారిగా తోట చంద్రశేఖర్ కు మంచి అనుభవం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అటువంటి అనుభవం ఉన్న నాయకుడినే పార్లమెంట్ కు పంపేందుకు దీవించాలని ఆయన ప్రజలను కోరారు. కాగా ప్రస్తుతం తోట చంద్రశేఖర్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా  ఉన్నారు.

అలాగే మద్దాల రాజేష్ మీలో మనిషి అని, గతంలో ఎమ్మెల్యేగా చేసినా..... వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ప్రభుత్వం సహకరించకపోవటంతో నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని జగన్ అన్నారు. జరగబోయే ఎన్నికల్లో తోట చంద్రశేఖర్ ను, మద్దాల రాజేష్ ను గెలిపించి తిరిగి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని ఆయన పేర్కొన్నారు.
Share this article :

0 comments: