వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి గురువారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో ‘వైఎస్ఆర్ జనభేరి’ సభ నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలో బుధవారం వైఎస్ఆర్ జనభేరి సభ ముగించుకుని బాగా పొద్దుపోయేసరికి జగన్ గుంటూరు చేరుకున్నారు. ఆయన గురువారం గుంటూరు నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ కన్వీనరు తలశిల రఘురాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. ఈ సభలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరనున్నారు.
Home »
» నేడు నరసరావుపేటలో ‘వైఎస్సార్ జనభేరి’
నేడు నరసరావుపేటలో ‘వైఎస్సార్ జనభేరి’
Written By news on Thursday, March 6, 2014 | 3/06/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment