గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో రోడ్ షో
వైసీపీ జిల్లా కన్వీనర్ బాలరాజు వెల్లడి
ఏలూరు, న్యూస్లైన్ :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 3, 4 తేదీల్లో ఏలూరు నగరం, నిడదవోలు పట్టణంలో ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట ఎన్నికల శంఖారావం పూరించనున్నారని పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బహిరంగ సభలకు జనం పెద్దఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. 3న మధ్యాహ్నం వైఎస్ జగన్ విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు
చేరుకుంటారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 4 గంటలకు ఏలూరు వస్తారని, అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. ఆరోజు రాత్రి జిల్లాలోనే బస చేస్తారని తెలిపారు.
4వ తేదీ ఉద యం గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల మీదుగా రోడ్షో నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు నిడదవోలు గణేష్చౌక్లో జరిగే జనభేరి బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. జగన్మోహన్రెడ్డి రెండురోజుల పర్యటనకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, పార్టీ నేతలు, కార్యకర్తలు అధినేత పర్యటనను విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్నారని తెలి పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరగకుండా పోరాడారని.. కానీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కవడంతో విభజన జరిగిపోతోందని ఆవేదనన వ్యక్తం చేశారు. ప్రజలను పట్టించుకోకుండా, పోరాటాలను లెక్కచేయకుండా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, దొంగనాటకాలు ఆడుతున్న తెలుగుదేశం పార్టీకి త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సీమాంధ్రను అభివృద్ధి చేయడం వైఎస్ జగన్ వల్లే సాధ్యమని, ప్రజలు ఆయన్ను ఆదరించాలని కోరారు.
0 comments:
Post a Comment