వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులుగా పలువురిని నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మెరుగుమల శ్రీదేవి(విశాఖ దక్షిణ), కాకి నిర్మల(గాజువాక), ఎర్రంరెడ్డి ఇందిరారెడ్డి(రంగారెడ్డి), ఇందిరారెడ్డి(కరీంనగర్), డి.సుశీల(హైదరాబాద్), ఉప్పులేటి అనిత(విజయవాడ సిటీ)ను రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమించినట్లు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా విశాఖపట్నం రూరల్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పైలా జానకి, కరీంనగర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా కె.సంధ్యారాణిని నియమించినట్టు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Home »
» వైసీపీ మహిళా విభాగం కమిటీ సభ్యులు
వైసీపీ మహిళా విభాగం కమిటీ సభ్యులు
Written By news on Friday, March 28, 2014 | 3/28/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment