చంద్రబాబులా అబద్ధాలు చెప్పను - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబులా అబద్ధాలు చెప్పను

చంద్రబాబులా అబద్ధాలు చెప్పను

Written By news on Monday, March 17, 2014 | 3/17/2014

చంద్రబాబులా అబద్ధాలు చెప్పను: రాజమండ్రి సభలో వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
రాజమండ్రి: టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు మాదరిగా తనకు అబద్ధాలు చెప్పడం చేతకాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలన భయంకరమైనదని, ఆయన ఏనాడూ ప్రజల వద్దకు వెళ్లి కష్టాలు పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్ జగన్ నిర్వహిస్తున్న వైఎస్ఆర్ జనభేరి సోమవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంది. రాజమండ్రిలో జగన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మీ ఆప్యాయతలు, ప్రేమనురాగాలకు పేరు పేరునా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

దివంగత మహానేత వైఎస్ఆర్ మరణించి ఇన్నేళ్లయినా ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని వైఎస్ జగన్ చెప్పారు. రామరాజ్యం చూడలేదు కానీ, వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని చూశామని గర్వంగా చెప్పవచ్చని అన్నారు. అందరూ కలసి కట్టుగా పోరాడి వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని స్థాపిద్ధామని పిలుపునిచ్చారు. సమయాభావం వల్ల ఎక్కవు సేపు జగన్ మాట్లాడలేకపోయారు. సోమవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా బ్రాహ్మణగూడెంలో వైఎస్ జగన్ రోడ్ షో ఆరంభమైంది. కొవ్వురు మీదుగా తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. జగన్ కు అడుగడుగునా ప్రజలు జేజేలు పలికారు. జనభేరి యాత్రకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలువురు నాయకులు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు.

Share this article :

0 comments: