ఆ అభిమాన జడిలో తడుస్తూ... పేరుపేరునా పలకరిస్తూ... సమస్యలను అడిగి తెలుసుకుంటూ... చెంపలపై జారుతున్న కన్నీటిని ఆప్యాయంగా తుడుస్తూ భావోద్వేగాల నడుమ వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జనభేరి యాత్ర జిల్లాలో సాగుతోంది. ప్రజలతో జగన్మోహన్ రెడ్డి మమేకమవుతున్న తీరు జిల్లా వాసులకు భవిష్యత్పై నమ్మకం పెరిగేలా చేస్తోంది. కష్టాలను అడిగి తెలుసుకుంటూ ‘నేనున్నాను..’ అంటూ ఆయన భరోసా ఇస్తున్న విధానం ఇన్నాళ్లకు సరైన నాయకుడు వచ్చాడన్న ఆనందం కలిగిస్తోంది.
నిశీధిలో వెలుగు రేఖలా... వెన్నుపోటు నాయకుల మధ్యలో ఆశాకిరణంలా జనం కళ్లలో ఇంద్రధనుస్సులు పూయిస్తూ జగన్మోహన్ రెడ్డి ముందుకుసాగుతున్నారు. ఆదివారం ఆయన చీపురుపల్లి నుంచి బయలుదేరి గరివిడి, గుర్ల, మెరకముడిదాం, దత్తిరాజేరు మండలాల మీదుగా గజపతినగరం చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు.
0 comments:
Post a Comment