కడప జిల్లాల్లో పర్యటన
10 నుంచి విజయమ్మ, షర్మిల ప్రచారం
హైదరాబాద్: లోక్సభ, శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11వ తేదీ నుంచి వైఎస్ఆర్ జనభేరి ప్రారంభించనున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిల కూడా ఈ నెల 10 నుంచి జనభేరి ప్రచార సభల్లో పాల్గొంటారని పార్టీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురామ్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
కర్నూలు నుంచి జగన్: జగన్ 11, 12 తేదీల్లో కర్నూలు, 13, 14 తేదీల్లో అనంతపురం, 15, 16 తేదీల్లో కడప జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తారు. పలుచోట్ల బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. గుంటూరు నుంచి విజయమ్మ: విజయమ్మ ఈ నెల 10న గుంటూరు జిల్లాలో తన పర్యటన ప్రారంభిస్తారు. 10, 11, 12 తేదీల్లో గుంటూరు, 13, 14 తేదీల్లో కృష్ణా, 15, 16 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆమె ప్రచారం నిర్వహిస్తారు.
తెలంగాణలో షర్మిల: షర్మిల సికింద్రాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెడతారు. 10 నుంచి 16వ తేదీ వరకు మల్కాజిగిరి, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. పార్టీ ప్రధాన ప్రచారకర్తలైన వీరి రోజువారీ పర్యటన వివరాలను తర్వాత ప్రకటించనున్నారు.
0 comments:
Post a Comment