11 గంటలకు వైఎస్ జగన్ నామినేషన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 11 గంటలకు వైఎస్ జగన్ నామినేషన్

11 గంటలకు వైఎస్ జగన్ నామినేషన్

Written By news on Thursday, April 17, 2014 | 4/17/2014

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు పులివెందుల శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా  నామినేషన్ దాఖలు చేయనున్నారు.   జగన్ తన సతీమణి భారతితో కలిసి ఉదయం 9.10 గంటలకు ఇడుపులపాయలో తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్  సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. నామినేషన్ పత్రాలను సమాధి వద్ద ఉంచి ప్రార్ధన చేశారు.  అక్కడి నుంచి నేరుగా పులివెందుల బయలుదేరుతారు. పులివెందులలో తన నివాసం నుంచి మద్దతుదారులతో ర్యాలీగా బయలుదేరుతారు. పులివెందుల పూల అంగళ్ల సర్కిల్‌ లో  బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.  

  అనంతరం ముద్దనూరు రోడ్డుమీదుగా జూబ్లీ బస్టాఫ్, నాలుగు రోడ్ల సర్కిల్, తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఉదయం 11గంటలకు  రిటర్నింగ్ అధికారికి వైఎస్ఆర్ సీపీ  అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను జగన్ అందజేస్తారు. జగన్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు లభిమానులు, కార్యకర్తలు  తరలివస్తున్నారు.

జగన్ తొలిసారిగా పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికలలో కడప లోక్ సభ  అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థిపై 1.75లక్షలపైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అనంతరం 2011లో వైఎస్‌ఆర్ సీపీని స్థాపించి, మేలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన  5,45,043 ఓట్ల భారీ మెజార్టీ సాధించడంతో జాతీయ స్థాయిలోనే ఆయన పేరు మారుమోగింది.
 
Share this article :

0 comments: