సీఎన్ఎన్-ఐబీఎన్, ఈనాడులో పెట్టుబడిదారులెవరో అందరికీ తెలుసునని చెప్పారు. పతనావస్థలో ఉన్న టీడీపీని భూతద్దంలో చూపేందుకు సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వే ప్రయత్నం చేసిందన్నారు. ఈ సర్వే తప్పుల తడకని ఆ ఛానెల్ చర్చలో పాల్గొన్నవారే చెప్పారని వెల్లడించారు. సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వేలు ఎప్పుడూ వాస్తవాలకు దగ్గరగా రాలేదని గుర్తు చేశారు. నీల్సన్ సర్వే వాస్తవానికి దగ్గరగా ఉంటే టీడీపీ నేతలు ఆ సర్వేపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నీల్సన్ మార్గ్ 50 వేల శాంపిల్స్తో సర్వే చేస్తే, సీఎన్ఎన్-ఐబీఎన్ కేవలం1300 మందితో మాత్రమే సర్వే నిర్వహించిందన్నారు. పవన్ కళ్యాణ్ మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పవన్ సినిమాల్లో నటించడమే తప్ప.. ఏ రోజైనా సమాజ సేవ చేశారా అని మైసూరారెడ్డి సూటిగా ప్రశ్నించారు.
0 comments:
Post a Comment