దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 21న జహీరాబాద్కు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జహీరాబాద్ చేరుకోనున్న షర్మిల, వైఎస్సార్సీపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మహ్మద్ మొహియొద్దీన్, జహీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ తరఫున ప్రచారం చేయనున్నారు.
ప్రచారంలో భాగంగా పట్టణంలో రోడ్డుషో నిర్వహించనున్న ఆమె, ఆ తర్వాత ఏర్పాటు చేయనున్న సభలో ప్రసంగించనున్నట్లు వైఎస్సార్ సీపీ నేతలు తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.
ప్రచారంలో భాగంగా పట్టణంలో రోడ్డుషో నిర్వహించనున్న ఆమె, ఆ తర్వాత ఏర్పాటు చేయనున్న సభలో ప్రసంగించనున్నట్లు వైఎస్సార్ సీపీ నేతలు తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.
0 comments:
Post a Comment