24న అనంతపురం జిల్లాలో షర్మిల జనభేరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 24న అనంతపురం జిల్లాలో షర్మిల జనభేరి

24న అనంతపురం జిల్లాలో షర్మిల జనభేరి

Written By news on Wednesday, April 23, 2014 | 4/23/2014

అనంతపురం :  మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈనెల 24వ తేదీన జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ, షర్మిల కార్యక్రమాల సమన్వయకర్త డాక్టర్ హరికృష్ణ తెలిపారు. 24న ఉదయం పులివెందుల మీదుగా ఆమె జిల్లాలో అడుగుపెడతారు.
 
 కదిరి, పుట్టపర్తి, మడకశిర, హిందూపురం నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. రోడ్డు మార్గంలో 25వ తేదీ ఉదయం చిత్తూరు జిల్లాకు వెళతారు. షర్మిల పర్యటనలకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు ఎం.శంకరనారాయణ తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత ఏడాది అక్టోబర్‌లో ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేసిన షర్మిల.. మళ్లీ ఎన్నికల ప్రచారం కోసం వస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.  
 
 పర్యటన ఇలా..
 24వ తేదీ ఉదయం 10 గంటలకు కదిరిలో రోడ్ షో, సభ
 11 గంటలకు ఓబుళదేవరచెరువులో రోడ్ షో, సభ
 సాయంత్రం 4 గంటలకు మడకశిరలో రోడ్ షో, సభ
 సాయంత్రం 5.30 గంటలకు హిందూపురంలో రోడ్ షో, సభ
 అనంతరం కదిరికి చేరుకుని బస చేస్తారు.
Share this article :

0 comments: