26 వేల మంది కార్మికులను రోడ్డున పడేసిన చంద్రబాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 26 వేల మంది కార్మికులను రోడ్డున పడేసిన చంద్రబాబు

26 వేల మంది కార్మికులను రోడ్డున పడేసిన చంద్రబాబు

Written By news on Tuesday, April 15, 2014 | 4/15/2014

26 వేల మంది కార్మికులను రోడ్డున పడేసిన చంద్రబాబు: వాసిరెడ్డి పద్మ
హైదారాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేట్‌పరం చేశారని తాము ముందు నుంచి చెబుతున్నట్లు వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. పరాఖ్‌ కూడా ఇదే అంశాన్ని తన పుస్తకంలో ప్రస్తావించారన్నారు.  ప్రపంచ బ్యాంకు షరతులకు చంద్రబాబు పాదక్రాంతమయ్యారన్నారు.  కేవలం ఆ బ్యాంకు చెప్పిందని చంద్రబాబు చేసిన పనుల వల్ల వేల మంది కార్మికులు వీధులపాలయ్యారని తెలిపారు. 54 ప్రభుత్వరంగ సంస్థలను మూసేసి 26వేల మంది కార్మికులను రోడ్డున పడేశారని చెప్పారు.

వైఎస్ జగన్మోహన రెడ్డిని  ఎవరు విమర్శించినా ఈనాడు రాస్తుందన్నారు. సొంత నియోజకవర్గంలో గెలుస్తారో? లేదో? చెప్పలేని సబ్బం హరి మాట్లాడితే ఈనాడు పేజీలకు పేజీలు రాసిందన్నారు. ఇలాంటి పిచ్చిరాతలు మానుకోవాలని వాసిరెడ్డి పద్మ సలహా ఇచ్చారు.
Share this article :

0 comments: