ఆ దివంగత మహానేత వైఎస్ ఎక్కడున్నారంటే చెయ్యి గుండెవైపు చూపిస్తుందని జగన్ గుర్తు చేశారు. ఆ మహానేత ఇంకా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై జగన్ మండిపడ్డారు. ఆనాటి బాబు పాలనను తలుచుకుంటే భయమేస్తుందన్నారు.తమ పిల్లల చదువుకోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో అనే విషయాన్ని ఆయన ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబుకు విశ్వసనీయత అన్నపదానికి అర్థం తెలియదన్నారు. పది మందికి మేలు చేయని బాబు.. ఈనాడులో సొంత డబ్బా కొట్టించుకోవడం ఒకేటే తెలసని ఎద్దేవా చేశారు.
చంద్రబాబులా సాధ్యం కాని హామీలు ఇవ్వడం నాకు చేతకాదని..ఏ పథకాలైతే అమలు చేస్తానో అవే తాను హామీలు ఇస్తున్నానని జగన్ తెలిపారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత టీడీపీ పార్టీ ఉండదని బాబుకు తెలుసని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రమాణ స్వీకారం చేసిన స్టేజీపైనే తలరాతను మార్చే ఐదు సంతకాలు చేస్తానన్నారు.అక్కచెల్లెమ్మలు తమ పిల్లల చదువుగురించి భయపడాల్సిన అవసరం లేదని.. అమ్మ ఒడి పథకంపై తొలి సంతకం చేసి వారికి అండగా నిలుస్తానని జగన్ తెలిపారు. అవ్వాతాతలు కూలికి వెళ్లకుండా రెండొందల పెన్షన్ను ఏడొందలు చేస్తూ రెండో సంతకం చేస్తానన్నారు. రైతన్నలకు 3వేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ మూడో సంతకం చేస్తానన్నారు. అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తూ నాల్గో సంతకం చేస్తానని, పేదవాళ్లు అడిగిన ప్రతివారికి ఏ కార్డు కావాలన్నావెంటనే ఇచ్చేలా ఐదో సంతకం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇల్లులేని నిరుపేదకు హామీ ఇస్తున్నావచ్చే 2019వ సంవత్సరం వచ్చేవరకు వచ్చే ఐదేళ్లలో పేదవారికి 50లక్షల ఇళ్లు కట్టిస్తానన్నారు.
రాష్ట్ర విభజనతో మనకు రెండు నష్టాలు జరిగాయని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రానికి నీళ్లు రాకుండా చేయడం మొదటిదైతే.. హైదరాబాద్ ను సీమాంధ్రులకు కాకుండా చేయడం రెండోదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నాటికి రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చేస్తానన్నారు.రైతన్నలకు 7 గంటల కరెంట్ పగటిపూట ఇచ్చేలా చూస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్ధిగా శ్రీనుని, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిగా శాంతిని వైఎస్ జగన్ ప్రకటించారు.
0 comments:
Post a Comment