సోమరాజు ఆధ్వర్యంలో శోభానాగిరెడ్డికి చికిత్స - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సోమరాజు ఆధ్వర్యంలో శోభానాగిరెడ్డికి చికిత్స

సోమరాజు ఆధ్వర్యంలో శోభానాగిరెడ్డికి చికిత్స

Written By news on Thursday, April 24, 2014 | 4/24/2014

సోమరాజు ఆధ్వర్యంలో శోభానాగిరెడ్డికి చికిత్స
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్ సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభానాగిరెడ్డిని కాపాడేందుకు కేర్ ఆస్ప్రత్రి ఛైర్మన్ డాక్టర్ సోమరాజు పర్యవేక్షణలో మూడు బృందాలు పనిచేస్తున్నాయి. ఆర్థో, న్యూరో, క్రిటికల్ కేర్ బృందాలు ఆమెకు చికిత్స చేస్తున్నాయి. ప్రస్తుతం సీటీ స్కాన్ తీశారు. పూర్తి స్థాయిలో పరీక్షలు చేసిన తర్వాతే ఏ చికిత్స అందిస్తారో తెలుస్తుంది. పరీక్షలన్నీ పూర్తయ్యి, చికిత్స ప్రారంభం అయిన తర్వాత మాత్రమే తాము మీడియాకు అప్ డేట్ ఇవ్వగలమని వైద్యులు చెప్పారు. మొత్తం చికిత్స అంతా కేర్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు పర్యవేక్షణలోనే జరుగుతోంది. అయితే 48 గంటల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఏ విషయమైనా చెప్పగలమని వైద్యులు అంటున్నారు. ఆమె మెడకు తీవ్ర గాయం అయ్యిందని, కంటి పైభాగంలో కూడా గాయం అయ్యిందని చెబుతున్నారు. వాహనం బాగా వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగి, వాహనం అద్దాలు పగిలి శోభానాగిరెడ్డి రోడ్డుపై పడటంతో బలమైన గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.

ఆమెకు తగిలిన గాయాల కారణంగా.. క్రిటికల్ కేర్ వైద్యులు ప్రధానంగా ఆమెను కంటికి రెప్పలా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్థో టీంలో ముగ్గురు, న్యూరో టీంలో ముగ్గురు నలుగురితో పాటు క్రిటికల్ కేర్ విభాగంలోని ఓ పెద్ద బృందం ఆమకు చికిత్స అందిస్తోంది. దాదాపు మరో గంట సమయంలో హెల్త్ బులెటిన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలా ఉందో మాత్రం తాము చెప్పలేమని వైద్యులు అంటున్నారు. అయితే ఆమెకు ఇంటర్నల్ బ్లీడింగ్ (అంతర్గత రక్తస్రావం) జరుగుతోందని మాత్రం తెలిసింది.



శోభానాగిరెడ్డికి తీవ్రగాయాలు.. హైదరాబాద్ కు తరలింపు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం
నంద్యాలలో ప్రాథమిక చికిత్స.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు


సాక్షి, ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా): వైఎస్సార్‌సీపీ ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి భూమా శోభా నాగిరెడ్డి బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శోభా నాగిరెడ్డి బుధవారం వైఎస్ షర్మిలతో పాటు నంద్యాలలో జరిగిన వైఎస్సార్ జనభేరి సభల్లో పాల్గొన్న అనంతరం ఆళ్లగడ్డలోని తమ నివాసానికి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కాసేపట్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం సంభవించింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆళ్లగడ్డ మండలం గూబగుండం మిట్ట వద్ద రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పల్ని తప్పించేందుకు సడెన్ బ్రేక్ వేయడంతో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడి నాలుగు పల్టీలు కొట్టింది.
డోర్ ఓపెన్ కావడంతో ముందు సీట్లో కూర్చున్న శోభా నాగిరెడ్డి వాహనం నుంచి ఎగిరి మళ్లీ వాహనంపై పడ్డారు. దీంతో ఆమె తలకు, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన నంద్యాలలోని సురక్ష ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అయితే, ఆమెకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాలని, అందుకు తప్పనిసరిగా హైదరాబాద్ తరలించాల్సిందేనని అక్కడి వైద్య వర్గాలు తెలిపాయి. దాంతో ఆమెను బంజారా హిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలియగానే వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నంద్యాల ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదంలో ఆమెతోపాటు కారు డ్రైవర్ నాగేంద్ర, గన్ మెన్ శ్రీనివాస్, బాషాలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
శోభానాగిరెడ్డికి పక్కటెముకలు విరిగాయని వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడానికి ఆమె తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వెంటిలేటర్ ద్వారా ఆమెకు శ్వాస అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఆమె తలకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం శోభా నాగిరెడ్డిని హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

Share this article :

0 comments: