నేటి నుంచే నగరంలో షర్మిల జనభేరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచే నగరంలో షర్మిల జనభేరి

నేటి నుంచే నగరంలో షర్మిల జనభేరి

Written By news on Sunday, April 20, 2014 | 4/20/2014

నేటి నుంచే షర్మిల జనభేరి
సాక్షి, సిటీబ్యూరో : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత వైఎస్ షర్మిల ఆదివారం నగరంలో ఎన్నికల జనభేరిని మోగించనున్నారు. ఉదయం పది గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద ప్రారంభయ్యే జనభేరి రాత్రి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్‌లో ముగుస్తుంది.

ఈ మేరకు పార్టీ సీఈసీ సభ్యులు కె.శివకుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. షర్మిల సభలకు భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నగరవాసులు స్వచ్ఛందంగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సాయంత్రం జరిగే వైఎస్ షర్మిల సభకు భారీ ఎత్తున అభిమానులు హాజరుకావాలని లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి మరో ప్రకటనలో కోరారు.

 నేటి సభలివీ..
 సమయం        వేదిక
 ఉదయం 10.00    :    యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు
 ఉదయం 11.30    :    ఖైరతాబాద్‌లోని బీఎస్ మక్తా
 మధ్యాహ్నం 3.30     :    సనత్‌నగర్
 సాయంత్రం 5.00      :    కేపీహెచ్‌బీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద
 సాయంత్రం 6.30    :    శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్  
Share this article :

0 comments: