ఎన్నికల ప్రచారం రద్దు చేసుకున్న జగన్, విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికల ప్రచారం రద్దు చేసుకున్న జగన్, విజయమ్మ

ఎన్నికల ప్రచారం రద్దు చేసుకున్న జగన్, విజయమ్మ

Written By news on Thursday, April 24, 2014 | 4/24/2014

తమ పార్టీ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి హఠాన్మరణంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల నేడు, రేపు తమ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. శోభానాగిరెడ్డి మరణవార్త తెలియగానే వీరు తమ ఎన్నికల కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు.

గుంటూరు జిల్లా పొన్నూరులో బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత వైఎస్ జగన్ హైదరాబాద్ కు బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్ విజయమ్మ అప్పటికప్పడు తన కార్యక్రమాలను రద్దుచేసుకుని హైదరాబాద్ వచ్చారు. కేర్ ఆస్పత్రికి వెళ్లి శోభానాగిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్దాంజలి ఘటించారు.

వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కడప నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రేపు శోభానాగిరెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు.
Share this article :

0 comments: