ఓటుతో ఉత్తమ్ కుమార్ కు బుద్ధి చెప్పండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓటుతో ఉత్తమ్ కుమార్ కు బుద్ధి చెప్పండి

ఓటుతో ఉత్తమ్ కుమార్ కు బుద్ధి చెప్పండి

Written By news on Friday, April 18, 2014 | 4/18/2014

నల్లొండ : మాజీమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వైఎస్‌ఆర్‌కే వెన్నుపోటు పొడిచారని ఆమె విమర్శించారు.  అలాంటి వ్యక్తికి ప్రజలకు వెన్నుపోటు పొడవకుండా ఎలా ఉంటాడని షర్మిల ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల శుక్రవారం నేరేడుచర్లలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ పెడితే... ఆయన మాత్రం మహానేత విగ్రహాలను ధ్వంసం చేయించారని షర్మిల మండిపడ్డారు. విగ్రహాలను ధ్వంసం చేయించడం దుర్మార్గపు చర్య అని అన్నారు. 

ప్రతి వర్గానికి వైఎస్ రాజశేఖరరెడ్డి అండగా ఉండి భరోసా కల్పించారలని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో రూపాయి వడ్డీ రుణాలు ఉంటే ...వైఎస్ హయాంలో పావలా వడ్డీ రుణాలు కల్పించారన్నారు. 70 లక్షల మందికి పెన్షన్లు, 47 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘటన వైఎస్ ఆర్ దేనన్నారు.

పేదల కోసం వైఎస్ఆర్ ఆగోగ్యశ్రీని ప్రవేశపెట్టారని... లక్షలమంది పేద ప్రజలు లబ్ది పొందారని షర్మిల తెలిపారు. అయితే కాంగ్రెస్ ఆరోగ్యశ్రీని తుంగలోకి తొక్కిందని ఆమె అన్నారు. వైఎస్ఆర్ అన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారని, గ్యాస్, కరెంట్ ఛార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు.
 
చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయుకుడిగా ఏనాడూ ప్రజల తరపున పోరాడలేదని షర్మిల అన్నారు. అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ సర్కార్ కు రక్షణ కవచంలా నిలిచారన్నారు. కాగా రాజన్న కూతురికి నల్గొండ జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున షర్మిల ప్రచారంలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: