వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు శాసనసభ స్థానంను సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కుమారుడు ఎర్రకోట జగన్మోహన్రెడ్డికి కేటాయించింది. ఈ స్థానం నుంచి మళ్లీ చెన్నకేశవరెడ్డే పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే చెన్నకేశవరెడ్డికి అనారోగ్యం కారణంగా తనయుడు జగన్మోహన్రెడ్డికి ఈ స్థానాన్ని కేటాయించారు.
ఎమ్మిగనూరు శాసన సభా స్థానానికి గతంలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రకోట చెన్న కేశవరెడ్డి 20,103 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వరుసగా ఆయన మూడవ సారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం తరపున బివి మోహనరెడ్డి పోటీ చేశారు.
ఎమ్మిగనూరు శాసన సభా స్థానానికి గతంలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రకోట చెన్న కేశవరెడ్డి 20,103 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వరుసగా ఆయన మూడవ సారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం తరపున బివి మోహనరెడ్డి పోటీ చేశారు.
0 comments:
Post a Comment