కువైట్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈస్ట్ వెస్ట్ గోదావరి చేందిన కమిటి సభ్యులు దేవ వినోద్ కుమార్, లాజరాస్, ప్రకాష్ గారి ఆధ్వర్యములో కువైట్ కో అర్డినేటర్ ఇలియాస్, జైంట్ కో అర్డినేటర్ బాలిరెడ్డి, సభ్యులు భాస్కర్ రెడ్డి, నాగరాజ్, మహేష్ రెడ్డి రేహామాన్ ఖాన్, గంగాధర్ ఈస్ట్ వెస్ట్ గోదావరి చేందిన యువకులను కలిసి తమ నియోజక వర్గాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు మద్దతు పలికి వారి విజయానికి తోడ్పడాలని కోరారు.
ఈ సందర్భముగా ఇలియాస్ మాట్లడతు చంద్ర బాబు గారి రాజకీయ జీవితం అంత అవకాశ వాద రాజకీయం మారిందని తెలుగు దేశం పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు స్వయాన మామ అయిన స్వర్గీయ రామారావు గారి కి వెన్ను పోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అప్పట్లో హారికృష్ణ, డా: దగ్గుపాటి వెంకటేశ్వరరావు 2009లో జునియార్ రామారావు వరకు తన రాజకీయ అవసరాల కోరకు కారేపాకుల వాడుకోని పక్కన పడేసిన ఘనత చంద్రబాబుది. 2014లో గత 10 సం:లుగా పార్టీని పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నా నాయకులకు ప్రక్కన పెట్టి కాంగ్రెస్ నుండి వలస వచ్చిన ధనవంతులకు పార్టీ అభ్యర్ధులుగా ప్రకటించడము. బి. జే.పీ. తో పొట్టు చారిత్రాత్మక దప్పిదం అని ఇప్పట్లో దేశ అవసరాల కోరకు పొత్తు అని చెప్పడం చంద్రబాబు అవకాశ రాజకీయాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. దేవ వినోద్ కుమార్, లాజరాస్, ప్రకాష్ మాట్లాడుతూ చంద్రబాబు మోసాపురిత హామీలు నమ్మి ప్రజలు ఓటు వెస్తే తన పార్టీకి నమ్ముకొని ఉన్నా నాయకులు నట్టేట్ట ముంచినట్లు ప్రజలను నట్టేట్ట ముంచుతరని. సిమాంధ్ర అబివృద్ధి, అన్ని వర్గాల ప్రజలకు సక్రమముగా సంక్షేమ పధకాలు అందాలంటే జన నేత జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవలసిన అవసరము మనకుందన్నరు ఈ కార్యక్రమములో డేవిడ్,సుజ్ఞాన్,శ్యాంసన్, జి. సునిల్ ,వై.పండు,కిషోర్,కె. వినోద్, ప్రకాష్, అన్సార్, సయ్యద్ నూర్, షేక్ ఫయాజ్ పాల్గోన్నారు
0 comments:
Post a Comment