వైఎస్ జగన్ మెహన్ రెడ్డి సోదరి షర్మిల హైదరబాద్, మెదక్ జిల్లాలో చేపట్టే ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 20 నుంచి 22 వరకూ షర్మిల ఈ రెండు జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఆమె ఎన్నికల ప్రచారానికి గాను ఈ రోజు షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఏప్రిల్ 20న జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సనత్నగర్,కేపీహెచ్ బీ, శేర్ లింగంపల్లిలో సభల్లో షర్మిల పాల్గొంటారు. అనంతరం ఏప్రిల్ 21 న మెదక్ జిల్లాలో ఆమె పర్యటన కొనసాగుతుంది.
జిల్లాలోని నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్ చెరువుల మీదుగా ఆమె ఎన్నికల రోడ్ షో నిర్వహిస్తారు. ఏప్రిల్ 22న కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఎల్బీ నగర్ ల్లో ఏర్పాటు చేయనున్న పలు సభల్లో ఆమె ప్రసంగిస్తారు.
జిల్లాలోని నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్ చెరువుల మీదుగా ఆమె ఎన్నికల రోడ్ షో నిర్వహిస్తారు. ఏప్రిల్ 22న కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఎల్బీ నగర్ ల్లో ఏర్పాటు చేయనున్న పలు సభల్లో ఆమె ప్రసంగిస్తారు.
0 comments:
Post a Comment