ఊరూరా తిరుగుతున్నా వాస్తవాలు చెప్పవేం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఊరూరా తిరుగుతున్నా వాస్తవాలు చెప్పవేం

ఊరూరా తిరుగుతున్నా వాస్తవాలు చెప్పవేం

Written By news on Wednesday, April 9, 2014 | 4/09/2014

అది గర్జన కాదు.. మొరగడమే!
* ఊరూరా తిరుగుతున్నా వాస్తవాలు చెప్పవేం..
*  చంద్రబాబుపై గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం
*  అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్‌తో నీకు పోలికా?
*  9 ఏళ్ల పాలనలో ఒక్క మంచి పనైనా చేశావా?
*  మైనార్టీలను మోసం చేయనని.. బీజేపీతో పొత్తా?
*  ‘బీసీ సీఎం’ మాట సీమాంధ్రలో చెప్పవేం బాబూ?

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.. గర్జన పేరుతో ఊరూరా తిరుగుతూ చేస్తున్నది కేవలం మొరగడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 12, 13, 14 అనుకుంటూ ఊరికో గర్జన సభ పెడుతున్న చంద్రబాబు ఎక్కడాకూడా వాస్తవాలు మాత్రం మాట్లాడలేకపోతున్నారని ఆయన విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం తదితర 20 అంశాలు తీసుకున్నా.. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డితో పోల్చితే చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ‘‘మాట్లాడితే హైటెక్ సిటీ అంటున్న చంద్రబాబు ఎప్పుడైనా ఒక్క ప్రాజెక్టు గురించి మాట్లాడారా?’’ అని ప్రశ్నించారు.
 
పులిచింతల, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేస్తే అవి వెయ్యి హైటెక్ సిటీలతో సమానమన్నారు. నిజానికి ఐటీ రంగంలోనూ చంద్రబాబు కన్నా వైఎస్ హయాంలోనే ఎగుమతులు ఎక్కువగా జరిగాయని, అధికారిక లెక్కలే చెప్తున్నాయన్నారు. చంద్రబాబు ఏనాడూ రైతులు, రుణాలు, వడ్డీ రాయితీ గురించి ఆలోచించిన పాపాన పోలేదని మండిపడ్డారు. తన పాలన గురించి చెప్పుకుని ఓటెయ్యమని అడిగే ధైర్యం లేక చంద్రబాబు ఇప్పుడు నరేంద్రమోడీ, పవన్‌కల్యాణ్, జేపీల మాస్క్‌లు ధరిస్తున్నారని ఎద్దేవాచేశారు. ‘‘కడపలో గర్జన పెట్టి.. పార్టీ ముందుకు పోతోందంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. కడపలో వైఎస్సార్ ఎలాంటి అభివృద్ధి చేశారో నీకు తెలుసా?’’ అని గడికోట ప్రశ్నించారు. పులివెందులే కాదు.. 293 నియోజకవర్గాల్లోనూ ఆయన అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.
 
  ‘‘చంద్రబాబు హయాంలో కుప్పం సహా మిగిలిన ప్రాంతాల్లో అంతటి అభివృద్ధి జరిగిందా? ధైర్యం ఉంటే చర్చకు రా?’’ అని బాబుకు సవాల్ విసిరారు. ఐదేళ్లలో కుప్పంలో వైఎస్సార్ 17 వేల ఫించన్లిప్పిస్తే, బాబు పదేళ్లలో 5 వేలే ఇవ్వగలిగారు. వైఎస్ 33 వేల ఇళ్లను కట్టిస్తే బాబు 10 వేలే కట్టించగలిగారని గడికోట ఎండగట్టారు. ఐదేళ్ల పాలనలో రుణాల మాఫీ, ధరల స్థిరీకరణ వంటివెన్నో చేసి రైతులకు వైఎస్ స్వర్ణయుగం చేశారన్నారు. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి మరో పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ‘ఇది చేశాను’ అని ఏదైనా చెప్పుకోగలరా? అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల అవసరాలు తెలిసింది ఒక్క జగన్‌కేనని, అందుకే ఆయన్ను ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.
 
 రాష్ట్ర విభజనకు ఢిల్లీలో లేఖలిచ్చి: రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘‘తెలంగాణ తన వల్లే వచ్చిందని వరంగల్‌లో మాట్లాడతారు. ఈ రకంగా రాష్ట్రాన్ని విభజించడమేంటని సీమాంధ్రలో మాట్లాడతారు. చంద్రబాబూ ఒక నాయకుడేనా?’’ అని ధ్వజమెత్తారు. ‘‘చనిపోయిన వైఎస్‌ని, ఆయన కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావ్? ఆయన బతికున్నప్పుడు ఆయనతో మాట్లాడే ధైర్యం చేయలేకపోయావ్’’ అని మండిపడ్డారు. ‘‘బీజేపీతో పొత్తుపెట్టుకోనని, మైనార్టీలకు అన్యాయం చేయనని చెప్పి ఇప్పుడు అదే బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తున్నావ్.. నెల రోజుల్లో నీకు గుణపాఠం తప్పదు’’ అని హెచ్చరించారు. ‘‘తెలంగాణలో బీసీని సీఎం చేస్తానని చెప్పిన బాబు.. సీమాంధ్రలో ఆ ప్రకటన ఎందుకు చేయలేకపోతున్నారు? సీమాంధ్రలో బీసీలే లేరా?’’ అని నిలదీశారు.

Share this article :

0 comments: