ఖమ్మం: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల స్పూర్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని షర్మిల అన్నారు. ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న ప్రచారంలో మాట్లాడుతూ.. రాజన్న రాజ్యం కోసం వైఎస్ఆర్సీపీకి ఓటు వేయండి అని షర్మిల పిలుపునిచ్చారు.
మహానేత మరణించి ఐదేళ్లయినా ప్రజల గుండెల్లో ఇంకా జీవించే ఉన్నారని ఆమె అన్నారు. రాష్ట్ర గతిని మార్చిన పాదయాత్రను కూడా వైఎస్ఆర్ తెలంగాణ నుంచే మొదలుపెట్టారని షర్మిల తెలిపారు. తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ స్థానాన్ని ఎవరూ చెరపలేరని షర్మిల అన్నారు.
ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపిద్దామని ప్రజలకు షర్మిల విజ్ఞప్తి చేశారు. అలాగే అసెంబ్లీ అభ్యర్థి కూరాకుల నాగభూషణంను అధిక మెజార్టీతో గెలిపించాలని షర్మిల సూచించారు.
0 comments:
Post a Comment