నేటి రాత్రికి ప్రకాశం జిల్లాకు జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి రాత్రికి ప్రకాశం జిల్లాకు జగన్‌

నేటి రాత్రికి ప్రకాశం జిల్లాకు జగన్‌

Written By news on Sunday, April 20, 2014 | 4/20/2014

వైఎస్సార్ జనభేరి
నేటి రాత్రికి వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు రాక
 సోమవారం ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభం
 కందుకూరు, సింగరాయకొండ, పర్చూరులలో బహిరంగ సభలు
 విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు  నూకసాని బాలాజీ పిలుపు


  వైఎస్ జగన్‌ ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో నిర్వహిస్తోన్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి జిల్లాకు వస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం రాత్రి కందుకూరు చేరుకుంటారు. అక్కడే రాత్రికి బస చేసి మరుసటి రోజు సోమవారం ఉదయం 10 గంటల నుంచి యాత్ర ప్రారంభిస్తారు.


  అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నానికి సింగరాయకొండ చేరుకుని బహిరంగ సభలో మాట్లాడి సాయంత్రానికి పర్చూరు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసే సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కోసం పార్టీ అభ్యర్థులు, శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.


 జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి ‘వైఎస్సార్ జనభేరి’ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: