ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్ మాత్రమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్ మాత్రమే

ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్ మాత్రమే

Written By news on Monday, April 14, 2014 | 4/14/2014

ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్ మాత్రమే
ఖమ్మం: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన రోడ్ షో అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లాలో పర్యటిస్తున్న ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.  ఈ రోజు ఎన్నికల రోడ్ షోలో పాల్వంచలో ప్రసంగించిన షర్మిల.. ఓటర్లను ప్రభావితం చేయడానికి కొంతమంది ప్రలోభాలకు గురి చేయడానికి యత్నిస్తారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎవరూ కూడా ఆ ప్రలోభాలకు గురి కాకుండా వైఎస్సార్ సీపీ పట్టంకట్టాలని ప్రజలకు విన్నవించారు.  ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగనన్న మాత్రమేనని స్పష్టం చేశారు.
 
ప్రజలు కష్టాలు తెలిసిన జగన్ ను సీఎంను చేసుకుందామని ఆమె విజ్ఞప్తి చేశారు. అన్న జగన్ తో పాటు తల్లి విజయమ్మ కూడా ప్రజల కోసం ఎన్నో దీక్షలు చేశారని తెలిపారు. రాజన్న రాజ్యాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే  వైఎస్సార్ సీపీని గెలిపించాలని షర్మిల తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు.
Share this article :

0 comments: