వైఎస్ఆర్ సీపీలోకి మాజీమంత్రి పార్థసారధి, వేదవ్యాస్
హైదరాబాద్ : ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు జోరందుకున్నాయి. తాజాగా మాజీమంత్రి పార్థసారధి, మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ శనివారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే డీజీపీ దినేష్ రెడ్డి, విజ్ఞాన్ రత్తయ్య, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment