నేడు షర్మిల పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు షర్మిల పర్యటన

నేడు షర్మిల పర్యటన

Written By news on Wednesday, April 23, 2014 | 4/23/2014

కర్నూలు : సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఆ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకోనున్నట్లు తేలిపోయింది. సర్వేలు కూడా అందుకు అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదటి విడత జిల్లాలోని పత్తికొండ, ఆస్పరిలో నిర్వహించిన జనభేరి సభలకు జనం నీరాజనం పలికారు. కుమ్మక్కు రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచిన.. విశ్వసనీయ రాజకీయాలతో ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల బుధవారం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పాదయాత్ర అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తుండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు పర్యటనను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు
 సన్నద్ధమయ్యారు. ఆమె రాక కోసం కుటుంబ సభ్యుల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కల్లూరు, ఆత్మకూరు, నంద్యాల ప్రాంతాల్లో ఆమె ఒక్క రోజు సుడిగాలి పర్యటన చేపట్టనున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు కల్లూరుకు చేరుకోనున్న షర్మిల రోడ్‌షో అనంతరం జనభేరి సభలో ప్రసంగిస్తారన్నారు.
 
 అక్కడి నుంచి నేరుగా ఆత్మకూరుకు పయనమవుతారని.. మార్గమధ్యలో స్థానికులను కలిసి మాట్లాడతారన్నారు. సాయంత్రం 4 గంటలకు ఆత్మకూరులో రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారన్నారు. రాత్రి 7 గంటలకు నంద్యాలలో రోడ్‌షో నిర్వహించి జనభేరి సభలో పాల్గొంటారన్నారు. షర్మిల పర్యటన నేపథ్యంలో గౌరు వెంకటరెడ్డితో పాటు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి.. పాణ్యం, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాల అభ్యర్థులు గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జనభేరి సభలను విజయవంతం చేయాలని గౌరు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: