మంజూరైన ఇళ్లకు కాంగ్రెస్ బిల్లులు చెల్లించలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంజూరైన ఇళ్లకు కాంగ్రెస్ బిల్లులు చెల్లించలేదు

మంజూరైన ఇళ్లకు కాంగ్రెస్ బిల్లులు చెల్లించలేదు

Written By news on Tuesday, April 22, 2014 | 4/22/2014

'మంజూరైన ఇళ్లకు కాంగ్రెస్ బిల్లులు చెల్లించలేదు'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక నాయకుడు ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అని వైఎస్సార్ సీపీ నేత షర్మిల స్పష్టం చేశారు. ఆయన ఐదేళ్ల పాలనలో ఏ రోజూ కూడా ఒక్క ఛార్జీ కూడా పెంచకుండా ప్రజల పట్ల  నిబద్ధత పనిచేస్తూ పాలన సాగించారన్నారు. ఈ రోజు ఎన్నికల రోడ్ షోలో భాగంగా మల్కాజ్ గిరిలో ప్రసంగించిన ఆమె..  కాంగ్రెస్-టీడీపీలపై విమర్శలు గుప్పించారు. ఆయన మరణం తరువాత పేదలకు మంజూరైన ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా అలసత్వం ప్రదర్శించిదని మండిపడ్డారు. రూ.32 వేల కోట్ల విద్యుత్ భారాన్నిప్రజలపై మోపి కాంగ్రెస్ ఆటలాడుకుందన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన విపక్షం టీడీపీ వారితో కుమ్మక్కై ప్రజలను మోసం చేసిందని షర్మిల అన్నారు.
 
ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలకపక్షంతో డ్రామాలాడారన్నారు. ప్రజా సమస్యల కోసం ఎవరైనా పోరాడింది అంటే అది వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. ప్రజల కోసం జగనన్న నిరంతరం నిరహారదీక్షలు చేశారన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు.
 
Share this article :

0 comments: