కృష్ణా: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తన గత పాలన గురించి ప్రజలకు చెప్పే దమ్మూ, ధైర్యం ఉందా?అని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. జిల్లాలోని అల్లూరులో ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్న ఆమె.. నమ్మశక్యం కాని చంద్రబాబు వాగ్గాలపై మండిపడ్డారు. ఆనాడు హైటెక్ సిటీ పేరుతో ఆయన ఎన్టీఆర్ భవన్ కట్టుకున్నారని విజయమ్మ ఎద్దేవా చేశారు. ఏనాడు కూడా ప్రజా హామీలను నెరవేర్చని చంద్రబాబు ఏముఖం పెట్టుకుని మళ్లీ ప్రజల వద్దకు వెళుతున్నాడని నిలదీశారు. తన పాలన గురించి ప్రజలకు చెప్పాలని విజయమ్మ సవాల్ విసిరారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఏఛార్జీలు పెంచకుండా ప్రజాసంక్షేమంలో రికార్డు సృష్టించిన నేత ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్సార్ అని తెలిపారు. తిరిగి ప్రజలకు వైఎస్సార్ సంక్షేమాన్ని అందించగల సత్తా జగన్ కు ఒక్కడికే ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే వైఎస్సార్ సీపీనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆమె స్పష్టం చేశారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఏఛార్జీలు పెంచకుండా ప్రజాసంక్షేమంలో రికార్డు సృష్టించిన నేత ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్సార్ అని తెలిపారు. తిరిగి ప్రజలకు వైఎస్సార్ సంక్షేమాన్ని అందించగల సత్తా జగన్ కు ఒక్కడికే ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే వైఎస్సార్ సీపీనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆమె స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment