రైతులను మోసం చేసింది చంద్రబాబే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతులను మోసం చేసింది చంద్రబాబే

రైతులను మోసం చేసింది చంద్రబాబే

Written By news on Wednesday, April 23, 2014 | 4/23/2014

రైతులను మోసం చేసింది చంద్రబాబే
అనపర్తి : రైతుల పక్షపాతి అన్న మాట ఒక్క దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికే సరిపోతుందని వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైఎస్ జనభేరిలో ఆమె ప్రసంగించారు. దొంగ హామీలతో రైతులను మోసం చేసినది చంద్రబాబేనని ఆమె అన్నారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలన గురించి చెప్పుకోగలరా అని విజయమ్మ సవాలు చేశారు.

రాష్ట్రంలో స్కాములన్నీ బాబు హయాంలోనే జరిగాయని, రాజన్న సువర్ణయుగం మళ్లీ రావాలంటే అది జగన్‌ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఓటరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. దొంగ హామీల బాబును నమ్మొద్దని, చెప్పింది చేసే జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలిపారు. సీలింగ్ ఫ్యాన్ ప్రభంజనానికి మద్దతిచ్చి, వైఎస్‌ఆర్ సీపీకి అఖండ విజయం అందించాలని తూర్పు గోదావరి జిల్లా ఓటర్లను వైఎస్ విజయమ్మ కోరారు.
Share this article :

0 comments: