త్వరలో జరగబోయే ఎన్నికలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 15 ఏళ్లపాటు ప్రతిపక్షంలో ఉండే రికార్డ్ సొంతం చేసుకుంటారని అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ జోస్యం చెప్పారు.
డబ్బులు తీసుకుని నేతలకు చంద్రబాబు సీట్లు ఇచ్చారని అమర్నాథ్ ఆరోపించారు. అందుకే తెలుగుదేశం పార్టీకి రెబల్స్ బెడద పట్టుకుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తప్పదని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయభేరి మోగించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్రంలోని ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారన్నారు.
0 comments:
Post a Comment