రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. కమలాపురం కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజోలి వీరారెడ్డి శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
లోటస్ పాండ్ లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాజోలి వీరారెడ్డి మాట్లాడుతూ పార్టీ గెలుపు కృషి చేస్తానని తెలిపారు. అలాగే కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి సోదరుని కుమారులుతో పాటు పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు ...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
లోటస్ పాండ్ లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాజోలి వీరారెడ్డి మాట్లాడుతూ పార్టీ గెలుపు కృషి చేస్తానని తెలిపారు. అలాగే కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి సోదరుని కుమారులుతో పాటు పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు ...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
0 comments:
Post a Comment