వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మళ్లీ రాజ్యన్న రాజ్యం తెచ్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటిని అమల్లోకి తీసుకు వస్తామన్నారు. ఓటు ద్వారా కాంగ్రెస్, టీడీపీ కుళ్లు, కుట్రలను తప్పికొట్టాలని జగన్ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం జగన్ వాహనంపై నుంచి అభివాదం చేస్తూ అక్కడ నుంచి నామినేషన్ సెంటర్ కు బయల్దేరారు. జూబ్లీ బస్టాఫ్, నాలుగు రోడ్ల సర్కిల్, తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను జగన్ అందజేస్తారు.
అంతకు ముందు ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద జగన్ మోహన్ రెడ్డి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఆయన వెంట.... సతీమణి వైఎస్ భారతీ, ఇతర కుటుంబ సభ్యులున్నారు. వైఎస్ఆర్ ఘాట్ మీద నామినేషన్ పత్రాలు ఉంచి జగన్ నివాళులు అర్పించారు.
0 comments:
Post a Comment