వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్, శాసన సభ అభ్యర్ధుల విజయం కొరకు ఎన్నికల ప్రచార పోస్టర్ లను విడుదల చేస్తున్నా వైయస్సార్ సి.పి. కువైట్ సభ్యులు
కువైట్: కువైట్ మాలియా ప్రాంతములో వైయస్సార్ సి.పి. ఎన్.ఆర్.ఐ. కన్వినర్ మేడపాటి వెంకట్, కువైట్ కో ఆర్డినేటర్ ఇలియాస్ గారి ఆదేశానుసారం జైంట్ కోఅర్డినేటర్ యం. బాలిరెడ్డి గారి ఆధ్వర్యములో ఎన్నికల ప్రచార పోస్టర్ లను విడుదల చేశారు.
ఈ సందర్భముగా బాలిరెడ్డి గారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయితనే సిమాంధ్ర అభివృద్ధి జరుగుతుంది గల్ఫ్ ఉన్నా వారి సమస్యలు పరిష్కార మార్గం దొరుకుతుందనే ఒకే ఒక ఉద్దేశముతో కువైట్ లో ప్రచారము నిర్వహించాలని పోస్టర్ లు మరియు 20 వేల కరపత్రాలు తయారు చేశామన్నారు, కువైట్ లో ఉన్న మన సిమాంధ్ర పని చేసె చోట నివాసాలు వెళ్లి వారి కుటుంబ సభ్యులను, బంధువులను, మిత్రులను మే 7న జరిగే సర్వతిక ఎన్నికలలో వైయస్సార్ సి.పి. పార్లమెంటు శాసన అభ్యర్ధుల ఫ్యాన్ గుర్తుకు ఓటు వేపించలని టెలిఫోన్ ద్వారా తెలపాలని ప్రచారము చేసి అభ్యర్ధుల విజయం కొరకు తమ వంతు సహాయము చేస్తామని తెలిపారు.గల్ఫ్ లో ఉన్నా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వారిపై అధరాపడి ఉంటారు కాబట్టి విరి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత,విలువ ఇస్తారు కాబట్టి కువైట్ లో ఉన్న వారి ఒక ఫోన్ కాల్ చాలు తప్పకుండా కుటుంబ సభ్యులు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తారని నమ్మకం మనకుందన్నారు.
ఈ కార్యక్రమములో కమిటీ సభ్యులు యం. వి. నరసా రెడ్డి, యన్. మహేష్ రెడ్డి, టి.జి.భాస్కర్ రెడ్డి, నాగారాజ్, సి. చంద్రశేఖర్ రెడ్డి, ఆకుల ప్రభాకర్, యం. చంద్రశేఖర్ రెడ్డి, రమణ యాదవ్, షేక్ ఇక్బాల్, ఆర్. ప్రకాష్, యన్. చంస్రశేఖర్ రెడ్డి, మరియు వై.యస్. ఆర్. అభిమానులు షేక్ ఆజీస్, సజ్జద్, శంషిర్ ఖాన్, అబూ తురాబ్, కృష్ణ రెడ్డి, మహాబూబ్ బాష, షేక్ ఖాసిం, తదితరులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment