కనీసం 130 సీట్లు ఖాయం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కనీసం 130 సీట్లు ఖాయం!

కనీసం 130 సీట్లు ఖాయం!

Written By news on Monday, May 5, 2014 | 5/05/2014

కనీసం 130 సీట్లు ఖాయం!
పులివెందుల : జనం గుండెల్లో ఇప్పటికీ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గూడుకట్టుకుని ఉన్నారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో కనిసం 130 సీట్లు గెలుచుకోవడం ఖాయమని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ధీమా వ్యక్తం చేశారు. ఒక టీవీ ఛానల్ (సాక్షి కాదు)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం తెలిపారు.

ప్రజల్లో తిరుగుతున్నప్పుడు, ప్రచార సభలకు వస్తున్న ప్రజల్లో పొంగి పొరలుతున్న అభిమాన ప్రవాహాన్నిచూస్తున్నప్పుడు ఈ విషయం తమకు ధీమాగా తెలుస్తోందని ఆమె చెప్పారు. అయితే ఈ విషయంలో లగడపాటి రాజగోపాల్ సహా కొన్ని సంస్థలు చేసిన సర్వేలు తప్పని ఆమె స్పష్టం చేశారు. గతంలో కూడా రాజగోపాల్ చెప్పిన కొన్ని సర్వేలు తప్పుగా తేలిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
కాగా, వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి సతీమణి వైఎస్‌ భారతి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్‌, అవినాష్‌రెడ్డికు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఆమెకు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఊళ్లకు ఊళ్లే కదిలొచ్చి ఆమెను ఆదరిస్తున్నాయి. వైఎస్ఆర్ జిల్లా పులివెందులతో పాటు పలు ప్రాంతాల్లో ఆమె, ఇతర కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు.
Share this article :

0 comments: