న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ 18 లోక్ సభా స్థానాలను గెలుచుకుంటుందని ఏబీపీ స్టార్ నీల్సన్ సంస్థ ఎగ్జిట్ సర్వే తెలిపింది. ఈ విషయంలో ఇప్పటివరకు వచ్చిన సర్వేలు వేర్వేరుగా తమ తమ ఫలితాలు ఇచ్చినా.. గత ఎన్నికలలో కచ్చితమైన ఫలితాలను ముందుగా ఊహించిన ఏబీపీ నీల్సన్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 లోక్ సభా స్థానాలు వస్తాయని తెలిపింది.
తెలుగుదేశం పార్టీకి 9 స్థానాలు, టీఆర్ఎస్ కు 8, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు మూడేసి స్థానాలు, ఇతరులకు మరో స్థానం దక్కుతాయని ఆ సర్వే పేర్కొంది. రాష్ట్రం సమైక్యంగా ఉండగానే జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 42 స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆ సంస్థ వెల్లడించింది.
తెలుగుదేశం పార్టీకి 9 స్థానాలు, టీఆర్ఎస్ కు 8, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు మూడేసి స్థానాలు, ఇతరులకు మరో స్థానం దక్కుతాయని ఆ సర్వే పేర్కొంది. రాష్ట్రం సమైక్యంగా ఉండగానే జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 42 స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆ సంస్థ వెల్లడించింది.
0 comments:
Post a Comment