వీటిలో జమ్మలమడుగు నియోజకవర్గంలో 3 కేంద్రాలు..
పాడేరు, పెనమలూరు నియోజకవర్గాల్లో 2 కేంద్రాలు..
ఈవీఎంలు ఫ్యాక్టరీ మోడ్లోకి వెళ్లిన 24 కేంద్రాలు..
సీఈవో భన్వర్లాల్కు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం
హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలు, వాటి కింద వచ్చే 21 అసెంబ్లీ స్థానాల పరిధిలోని 29 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 13న రీపోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) భన్వర్లాల్ తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో 12, సీమాంధ్ర జిల్లాల్లో 17 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహిస్తారు. సీమాంధ్ర జిల్లాల్లో రెండు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే రీపోలింగ్ అవసరం ఉందని మొదట సీఈఓ కార్యాలయం కేంద్ర ఎన్నికల కమిషన్కు సిఫారసు చేసింది. విశాఖపట్టణం జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కొయ్యూరు మండలం పలకజీడి 68వ పోలింగ్ కేంద్రంలో రెండు ఈవీఎంలను గుర్తు తెలియని వ్యక్తులు తగులపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని కోరింది. మరో పక్క ఈవీఎం సమస్య ఎదురైన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని మరో పోలింగ్ కేంద్రంలో కూడా రీ పోలింగ్ నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే ఈవీఎంలు పని చేయని కేంద్రాలను, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న జమ్మలమడుగు నియోజకవర్గాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ మొత్తం 29 కేంద్రాల్లో రీ పోలింగ్కు ఆదేశించింది.
అక్కడ మళ్లీ అవసరం లేదన్న కలెక్టర్లు..
రాష్ట్రంలో రెండు దశల పోలింగ్ సందర్భంగా మొత్తం మీద 161 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు ఫ్యాక్టరీ మోడ్లోకి వెళ్లిపోయాయని జిల్లా కలెక్టర్లు కేంద్ర ఎన్నికల కమిషన్కు మొదట్లో నివేదిక పంపించారు. దీనిపై కమిషన్ స్పందిస్తూ ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు ఫ్యాక్టరీ మోడ్లోకి వెళ్లడంపైన సవివరమైన నివేదికలు పంపాలని కలెక్టర్లను కోరింది. ఫ్యాక్టరీ మోడ్లోకి వెళ్లిన ఈవీఎంలను పక్కన పెట్టి కొత్త ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించామని, ఫ్యాక్టరీ మోడ్లోకి వెళ్లిన ఈవీఎంలో వేసిన ఓట్లను కూడా లెక్కించడానికి వీలవుతుందని కలెక్టర్లు స్పష్టం చేశారు. అయినా సరే కమిషన్ సవివరమైన నివేదికను పంపాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు రికార్డులను పరిశీలించి తుది నివేదికలను శనివారం సీఈఓ కార్యాలయానికి పంపించారు. కృష్ణా, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, ఉత్తరాంధ్రలోని ఒక జిల్లాలో కలిపి మొత్తం 24 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు మాత్రమే ఫ్యాక్టరీ మోడ్లోకి వెళ్లాయని, అయినా పోలింగ్కు ఎటువంటి అంతరాయం కలగలేదని, ఈ స్థానాల్లో రీ పోలింగ్ అవసరం లేదని జిల్లా కలెక్టర్లు నివేదించారు. ఈ నివేదికలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం శనివారం కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపించింది. వీటన్నింటినీ పరిశీలించిన కమిషన్.. మొత్తం 29 చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని సూచించింది.
రీపోలింగ్ కేంద్రాలివీ...
లోక్సభ స్థానం అసెంబ్లీ స్థానం పోలింగ్ స్టేషన్ ఏసీ/పీసీ
నిజామాబాద్ బోధన్ 64 పీసీ
జహీరాబాద్ జుక్కల్ 134 పీసీ
జహీరాబాద్ బాన్సువాడ 146 ఏసీ
జహీరాబాద్ బాన్సువాడ 39, 187 పీసీ
నిజామాబాద్ నిజామాబాద్ రూరల్ 48, 168 ఏసీ
నిజామాబాద్ నిజామాబాద్ రూరల్ 9 పీసీ
మల్కాజిగిరి కూకట్పల్లి 171/ఎ ఏసీ
ఖమ్మం కొత్తగూడెం 161 ఏసీ
మహబూబాబాద్ భద్రాచలం 239 ఏసీ
శ్రీకాకుళం శ్రీకాకుళం 46 పీసీ
అరకు కురుపాం 192 ఏసీ
అరకు సాలూరు 134 ఏసీ
అరకు పాడేరు 68 ఏసీ, పీసీ
మచిలీపట్నం గుడివాడ 123 పీసీ
మచిలీపట్నం అవనిగడ్డ 29 పీసీ
మచిలీపట్నం అవనిగడ్డ 91 ఏసీ
మచిలీపట్నం పెనమలూరు 59, 172 ఏసీ
విజయవాడ విజయవాడ తూర్పు 212 పీసీ
విజయవాడ మైలవరం 123 పీసీ
విజయవాడ నందిగామ 171, 174 ఏసీ
విజయవాడ జగ్గయ్యపేట 122 పీసీ
కరీంనగర్ హుస్నాబాద్ 170 పీసీ
కడప జమ్మలమడుగు 80, 81, 82 ఏసీ, పీసీ
0 comments:
Post a Comment