సాయంత్రం 5 గంటల వరకు 71.09 శాతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాయంత్రం 5 గంటల వరకు 71.09 శాతం

సాయంత్రం 5 గంటల వరకు 71.09 శాతం

Written By news on Wednesday, May 7, 2014 | 5/07/2014

సీమాంధ్రలో పోలింగ్ ముగిసింది: భన్వర్ లాల్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ వెల్లడించారు. పోలింగ్ గడువు సాయంత్రం 6.00 గంటల్లోగా క్యూ లైన్ లో ఉన్నవారందరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.బుధవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 71.09 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు.
 
కొద్దిపాటి చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందన్నారు. మే 16వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
Share this article :

0 comments: