ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఆగిపోయాయి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఆగిపోయాయి?

ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఆగిపోయాయి?

Written By news on Wednesday, May 14, 2014 | 5/14/2014

13సాయంత్రానికి సీమాంధ్ర, తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ పై వున్న నిషేధం తొలగిపోయింది. దాదాపు అన్ని చానెళ్లు ఇక అంచనా ఫలితాలతో హొరెత్తిస్తాయని అనుకున్నారంతా. కానీ అలా జరగేలేదు. ఎందుకని? విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు అన్ని చానెళ్ల ఎగ్జిట్ పోల్ సర్వేల్లో వైకాపాకు వందకు పైగా స్థానాలు వస్తాయని తేలినట్లు తెలుస్తోంది. కానీ మున్సిపల్ ఫలితాలు చూసుకుంటే తేదపా ముందంజలో వుంది. అదే ఎంపీటీసీ కి వస్తే, పోరు హొరా హోరీగా వుంది. దీంతో చానెళ్లు తమ సర్వేలు ఏ మేరకు వాస్తవం అన్నదానిపై అయోమయంలో పడినట్లు బోగట్టా.
 ఒక్క 10 టీవీ మాత్రం తన సర్వేను ప్రకటించింది. అది వైకాపా కే మొగ్గు వుందని స్పష్టం చేసింది.  నిజానికి సాయంత్రానికి ఎంపీటీసీల్లో వైకాపా చాలా వరకు ఫుంజుకుంది. మండల ప్రజాపరిషత్ ల్లో లీడ్ లోకి వెళ్లింది. 

జిల్లాల వారీగా చూసుకుంటే చాలా జిల్లాల్లో తెలుగుదేశం ఆధిక్యత వున్నా, అక్కడ చాలా దగ్గరగానే వైకాపా కూడా వుండడం విశేషం. దీంతో చానెళ్ల సర్వేలు వైకాపా కు అనుకూలంగా రావడం పెద్ద విశేషం కాదు.
 కానీ మెజారిటీ చానెళ్లు తేదేపాకు అనుకూలమైనవి కావడంతో, ఇప్పుడు తాము ప్రకటించినా, ప్రకటించకున్నా, ఫలితం ఒకటే కనుక, సైలెంట్ అయ్యాయని అంతర్గత వర్గాల బోగట్టా.  టీవీ 9 మరాఠీ చానెల్ జాతీయ స్థాయిలో చేసిన సర్వేలో కూడా వైకాపాకే మొగ్గు కనిపించింది.

 అన్ని చానెళ్లు ఎగ్జిట్ సర్వేలు చేసినపుడు తెలుగు చానెళ్లు చేయకుండా ఎందుకుంటాయి. కానీ ఎందుకు బయటపెట్టడం లేదన్నది ప్రశ్న. నీల్సన్ తో కాంట్రాక్టు వున్న ఎన్టీవీ కూడా సర్వే చేయించిందని, కానీ ఈ సమయంలో ఇక వెల్లడించడం ఎందుకని మిన్నకుందని తెలుస్తోంది. మొత్తం మీద తేదేపాకు అనుకూలంగా వచ్చిన మున్సిపాల్టీ, వైకాపాకు హుషారు పెంచిన ఎంపీటీసీ లెక్కింపులు కలిసి, ప్రేక్షకులకు ఎగ్జిట్ పోల్స్ అందకుండా చేసాయి. 

- See more at: http://telugu.greatandhra.com/politics/elections-2014/exit-polls-enduku-agipoyayi-52616.html#sthash.H8b0UyNR.dpuf
Share this article :

0 comments: