తీర్పును మనస్పూర్తిగా అంగీకరిస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. తమపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లకు జగన్ అభినందనలు తెలిపారు.
అయిదేళ్లలో మళ్లీ వస్తాం
అయిదేళ్ల తర్వాత మళ్లీ తాము అధికారంలోకి వస్తామని వైఎస్ జగన్ అన్నారు. తాము ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షంలోకి రాలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నామని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత ఇద్దరు ఎంపీలు, 17మంది ఎమ్మెల్యేలకు పెరిగిందన్నారు. ప్రస్తుతం తమ బలం 70 మంది ఎమ్మెల్యేలు, పదిమంది ఎంపీల వరకూ పెరిగిందని జగన్ అన్నారు. మోడీ గాలి, బాబు అమలుకాని హామీలు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.
మా పొత్తు ప్రజలతోనే
తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని వైఎస్ జగన్ స్ఫష్టం చేశారు. తమ పొత్తు ప్రజలతోనే అని ఆయన తెలిపారు. ప్రజల మనసులో నిలబడితే అదే పదివేలు అని జగన్ అన్నారు. ఈ అయిదేళ్లలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తాము పోరాడతామని జగన్ తెలిపారు. మళ్లీ కోలుకుని... అధికారంలోకి వస్తామని ఆయన తెలిపారు.
0 comments:
Post a Comment