Home »
» ప్రకాశంలో వైఎస్ఆర్ సీపీ జయభేరి.. జెడ్ పీ పీఠం సొంతం
ప్రకాశంలో వైఎస్ఆర్ సీపీ జయభేరి.. జెడ్ పీ పీఠం సొంతం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. జిల్లాలో మెజార్టీ జెడ్ పీటీసీ స్థానాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్ లో వెలువడిన తొలి జెడ్ పీ చైర్మన్ ఫలితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి రావడం విశేషం. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తోంది. అత్యధిక ఎంపీటీసీ, జెడ్ పీటీసీలను గెలిచింది. ఈ మూడు జిల్లాల్లో జెడ్ పీ చైర్మన్ పదవులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకునే దిశగా మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. ఇక గుంటూరు, కృష్ణా, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో టీడీపీతో హోరాహోరీగా సీట్లను గెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా అందాల్సివుంది.
0 comments:
Post a Comment