మిథున్ అఖండ విజయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మిథున్ అఖండ విజయం

మిథున్ అఖండ విజయం

Written By news on Saturday, May 17, 2014 | 5/17/2014

మిథున్ అఖండ విజయం
పుంగనూరు, న్యూస్‌లైన్ : ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులను ఢీకొని రాజంపేట లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అత్యధిక మెజారిటీతో ఎన్నికై రికార్డు సృష్టించారు. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి, ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీలో దిగారు.

ఎన్నికల ప్రచారంలో పురందేశ్వరి, సాయిప్రతాప్ త మ శక్తియుక్తులు దారపోసి మిథున్‌రెడ్డిని ఓడించేందుకు ప్రయత్నాలు చేశారు. మిథున్‌రెడ్డి, ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ చతురత ముందు ప్రత్యర్థుల ఆటలు సాగలేదు. యువనేత మిథున్‌రెడ్డి సుమారు 1,74,762 ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించారు. పుంగనూరు నియోజకవర్గంలో మిథున్‌రెడ్డికి 1,05,772 ఓట్లు లభించాయి.

పురందేశ్వరికి 60,674 ఓట్లు వచ్చాయి. మరో మాజీ మంత్రి సాయిప్రతాప్‌కు 4,927 ఓట్లు మాత్రమే పోలయ్యూరుు. పుంగనూరులో మిథున్‌రెడ్డికి 46,009 ఓట్ల మెజారిటీ లభించింది. నిత్యం ప్రజా సేవలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయలు సొంత నిధులు ఖర్చుచేస్తున్న తండ్రీతనయులను ప్రజలు ఆదరించారు. విశేష అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతటి ఘన విజయం అందించిన పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


పీలేరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి ఘన విజయం వెనుక మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర కీలకమైంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ సీఎం కిరణ్‌ను పీలేరులో ఓడించడమే ఏకైక లక్ష్యంగా పెద్దిరెడ్డి పావులు కదిపారు.

ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు ఆయన తనయుడు, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించారు. దీంతో చింతల 15,250 ఓట్ల ఆధిక్యతతో జేఎస్పీ అభ్యర్థి నల్లారి కిషన్‌కుమార్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు.

నల్లారి కుటుంబానికి గుర్రంకొండ మండలంలో అత్యంత విధేయుడు, మైనారిటీల్లో బలమైన నేత అయిన జమీర్‌ఆలీఖాన్‌ను వైఎస్సార్ సీపీలో చేర్చుకోవడంతో గుర్రంకొండలో ఆధిక్యతను చాటారు. అలాగే కేవీపల్లె మండల మాజీ ఉపాధ్యక్షుడు ఎం.వెంకట్రమణారెడ్డి మాజీ సీఎం కిరణ్‌కు అత్యంత సన్నిహితుడు, మండలంలో ప్రజా బలం ఉన్న నేత. ఆయన్ను సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంతో కిరణ్ కోటకు బీటలు వారాయి.
 
అంతటితో ఆగని పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కిరణ్‌కు అత్యంత సన్నిహితుడైన గుడిబండ రవికుమార్‌రెడ్డిని సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేర్చుకున్నారు. పీలేరు మండలంలో మాజీ ఎంపీపీ ఎం.వెంకట్రమణారెడ్డితోపాటు జాండ్ల, వేపులబైలు సర్పం చ్‌లు శ్రీనివాసులు, ఆదినారాయణలను పార్టీలో చేర్చుకున్నారు. వేపులబైలు పంచాయతీలో కీలకమైన వ్యక్తి అయిన భవనం వెంకట్రామిరెడ్డి మరికొంతమంది ప్రముఖలను పార్టీలో చేర్చుకోవడం గమనార్హం.

పీలేరు పట్టణంలో అత్యంత ప్రజాదరణ కల్గివున్న మాజీ సర్పంచ్ ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు విశేష కృషి చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి సూచనలు, ఆదేశాల మేరకు ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి పార్టీ బలోపేతం కోసం పట్టణంలో శక్తివంచనలేకుండా కృషి చేశారు. మూడన్నరేళ్లు అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారంలో మాజీ సీఎం కిరణ్ విఫలమయ్యారని పెద్దఎత్తున ప్రజలకు వివరించి అత్యధికంగా ఓట్లు రాబట్టడంలో సఫలీకృతులయ్యారు.

మరోవైపు నియోజకవర్గ పరిధిలోని కలికిరి మినహా ఐదు మండలాల్లో బలమైన పార్టీ కేడర్ ఉండడం గెలుపునకు ప్రధాన కారణమైంది. ఇటీవల వెలువడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడంతోపాటు జెడ్పీటీసీల్లో పీలేరు, కేవీపల్లె, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లో విజేతలుగా నిలిచారు. మాజీ సీఎం కిరణ్ తన సోదరుడు కిషన్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినా పెద్దిరెడ్డి ఎత్తుల ముందు చిత్తుకాక తప్పలేదు. అలాగే టీడీపీ మూడో స్థానానికే పరిమితం కావడం, కాంగ్రెస్ గల్లంతు కావడంతో చింతల గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేకపోయింది.
Share this article :

0 comments: